ఏపీలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఎయిర్పోర్ట్ ఆర్థిక నియంత్రణ సంస్థ (AERA) యూజర్ డెవలప్మెంట్ ఫీజులను ప్రకటించింది. దేశీయ ప్రయాణికుల నుంచి రూ.835, అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి రూ.1,255 వసూలు చేస్తారు. విశాఖలోని పౌర విమాన సర్వీసులను దశలవారీగా భోగాపురానికి మార్చనున్నారు. ఆగస్టు 16న సింగపూర్ నుంచి తొలి అంతర్జాతీయ విమానం రానుంది.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం.. యూజర్ ఫీజులు ప్రకటన
Source: telugutimes.net
Read the live feed on ZapIndies