విరూపాక్షి అరెస్టుపై జగన్ ఆగ్రహం.. ఉగ్రవాదిలా వ్యవహరించారంటూ విమర్శ

విరూపాక్షి అరెస్టుపై జగన్ ఆగ్రహం.. ఉగ్రవాదిలా వ్యవహరించారంటూ విమర్శ

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, జంగిల్ రాజ్ నడుస్తోందని ఆరోపించారు. ఆలూరు ఎమ్మెల్యే బి. విరూపాక్షిని అర్ధరాత్రి 2:45కు వందల మంది పోలీసులతో ఇంటిపై దాడిచేసి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. దాడిలో గాయపడిన ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని, సీసీటీవీ హార్డ్డిస్క్లు స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు. ఇలాంటి అక్రమ అరెస్టులు రాష్ట్రమంతా కొనసాగుతున్నాయని, పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies