పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ స్వాత్ జిల్లాలో ఉగ్రవాదులు శాంతి ర్యాలీపై ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు. స్థానికంగా పెరుగుతున్న హింసను నిరసిస్తూ ప్రశాంత వాతావరణం కోరుతూ నిర్వహించిన ర్యాలీని లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. భద్రతా బలగాలు ప్రాంతాన్ని కట్టుదిట్టం చేశాయి.
పాకిస్థాన్లో శాంతి ర్యాలీపై ఆత్మాహుతి దాడి: 7 మృతి
Source: Vaartha
Read the live feed on ZapIndies