మండల కేంద్రాల్లో ప్రజావాణి.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

మండల కేంద్రాల్లో ప్రజావాణి.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ఇకపై మండల కేంద్రాల్లో నిర్వహించాలని నిర్ణయించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. దాదాపు 23 రకాల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా పాల్గొంటారు. భూ, పెన్షన్, రేషన్ కార్డు సమస్యల కోసం జిల్లా కలెక్టరేట్లకు వెళ్లాల్సిన అవసరం తప్పడంతో ప్రజలకు సులభతరం కానుంది.

Source: OneIndia Telugu

Read the live feed on ZapIndies