విశాఖపట్నంలోని అరిలోవా ప్రాంతంలో బుధవారం నాడు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కలల్లోని సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్కు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. సింధు, క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ స్థాయి శిక్షణ సౌకర్యాలతో ఆంధ్రప్రదేశ్లో ఆధునిక క్రీడా వ్యవస్థను ఏర్పాటు చేసి యువ క్రీడాకారులను తీర్చిదిద్దాలన్నది ఈ అకాడమీ లక్ష్యం.
పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి నారా లోకేశ్ శంకుస్థాపన
Source: Telugu Bulletin
Read the live feed on ZapIndies