తెలంగాణ పౌరసరఫరాల శాఖలో భారీ కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత 11 ఏళ్లలో రూ.13,390 కోట్ల విలువైన బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించలేదని తనిఖీల్లో తేలింది. బీఆర్ఎస్ పాలనలో రూ.11,304 కోట్లు, కాంగ్రెస్ ప్రభుత్వంలో 2025 వరకు రూ.2,095 కోట్లు బాకీ పడ్డాయి. ఇప్పటివరకు రూ.6,768 కోట్లు రికవరీ చేయగా, మిగిలిన బకాయిల కోసం మిల్లుల సీజ్, బ్లాక్ లిస్ట్, ఆర్ఆర్ యాక్ట్ కేసులు వంటి చర్యలు చేపడుతున్నారు.
తెలంగాణలో రూ.13,390 కోట్ల బియ్యం స్కామ్ వెలుగులోకి
Source: Vaartha
Read the live feed on ZapIndies