వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 25న అధినేత జగన్ 175 నియోజకవర్గాల ఇంచార్జీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, 17.29 లక్షల డూప్లికేట్ ఓట్లపై దృష్టి పెట్టాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రక్రియను ఆగస్టు 27, 28 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
Source: NTV Telugu