న్యూయార్క్ నగరంలో 17 అత్యాధునిక పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయబడుతున్నాయి. మేయర్ జోహ్రాన్ మమ్దానీ ప్రకటించిన ఈ ప్రాజెక్టు వ్యయం 4 మిలియన్ డాలర్లు. ప్రతి యూనిట్ ధర 2,35,000 డాలర్లకు పైగా. వినియోగం ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. దీర్ఘకాలం లోపల ఉండటం, చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిరోధించడమే లక్ష్యం. మొబైల్ లేదా కాంటాక్ట్లెస్ కార్డుతో తలుపులు తెరవవచ్చు. ఈ నిబంధనపై ప్రజల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
న్యూయార్క్లో స్మార్ట్ పబ్లిక్ టాయిలెట్లు.. 10 నిమిషాలకే తలుపులు ఆటోమేటిక్గా ఓపెన్
Source: Gulte Telugu