విశాఖపట్నం ఆర్కే బీచ్లో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సాగర స్వచ్ఛత కార్యక్రమాన్ని పరిశీలించి, పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ పైలట్ సైట్ను వర్చువల్గా ప్రారంభించారు. సముద్ర వ్యర్థాల సేకరణలో మత్స్యకారులకు అదనపు ఆదాయం కలుగుతున్నట్లు వారు తెలిపారు. 1,200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు లక్ష్యంగా అధికారులు వివరించారు.
విశాఖ ఆర్కే బీచ్లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు
Source: telugutimes.net