పెట్రోల్ ధరల పెరుగుదలతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అమ్మకాలు భారీగా పెరిగాయి. ఏడాది ప్రారంభంలో నెలకు 5,000 లోపు ఉన్న విక్రయాలు జూన్లో 10,000 మైలురాయిని దాటగా, జూలైలో 11,000కు పైగా నమోదయ్యాయి. ఈ జోరు కొనసాగితే ఏడాది మొత్తం లక్ష మార్కును దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఛార్జింగ్ స్టేషన్ల కొరత, రాయితీలు లేకపోవడం వంటి సమస్యలు పరిష్కరిస్తే మరింత వృద్ధి సాధ్యమని వాహనదారులు భావిస్తున్నారు.
పెట్రోల్ ధరల షాక్తో ఈవీ సేల్స్ రికార్డు స్థాయికి
Source: Vaartha