అంతర్జాతీయ, దేశీయ ముడి సరకుల ఖర్చులు పెరగడంతో ప్రముఖ FMCG కంపెనీలు నిత్యావసర వస్తువుల ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. జూన్ త్రైమాసికంలో 2-5% పెంచిన కంపెనీలు సెప్టెంబర్లో మరోసారి ధరలు పెంచనున్నాయి. బ్రిటానియా ఇప్పటికే 1.5-2% పెంచనున్నట్లు ప్రకటించింది. సబ్బులు, షాంపూలు, బిస్కెట్లు, టీ పొడి వంటి వస్తువులపై పెంపు కుటుంబ బడ్జెట్పై ప్రభావం చూపనుంది.
FMCG కంపెనీల ధరల పెంపు: సామాన్యులకు షాక్
Source: Vaartha