సుప్రీంకోర్టు కొలీజియం పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్కు చెందిన జస్టిస్ వల్లూరి కామేశ్వరరావును సిఫారసు చేసింది. ఆయనతో పాటు మరో ముగ్గురు న్యాయమూర్తులను వరుసగా కలకత్తా, బాంబే, పంజాబ్-హరియాణా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత నియామకాలు ఖరారవుతాయి.
పట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ వల్లూరి కామేశ్వరరావు
Source: Andhra Jyothy