హైదరాబాద్ బాలానగర్లో ఈగల్ ఫోర్స్ దాడుల్లో 14.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, కొరియర్, ర్యాపిడో ద్వారా డెలివరీ చేస్తున్న కొత్త తరహా దందాను ఛేదించారు. ముగ్గురు అన్నదమ్ములు, ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు 69 మంది స్మగ్లర్లు, 49 మంది వినియోగదారులు అదుపులోకి వచ్చారు.
బాలానగర్లో గంజాయి దందా ఛేదనం.. 14.5 కిలోల గంజాయి స్వాధీనం
Source: NTV Telugu