హిందూ ధర్మం, నినాదాల దుర్వినియోగంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో నటి అనసూయ భరద్వాజ్ స్పందించారు. తన మాటలను కొందరు కావాలనే వక్రీకరించారని, సనాతన ధర్మాన్ని అవమానించినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను సనాతన ధర్మాన్ని పాటించే హిందువునని, హనుమంతుడి భక్తురాలినని స్పష్టం చేశారు.
ట్రోలింగ్పై అనసూయ స్పందన: నా మాటలను వక్రీకరించారు
Source: Chitrajyothy