మహారాష్ట్ర ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే పాల కల్తీపై షాకింగ్ వివరాలు వెల్లడించారు. కాస్టిక్ సోడా, డిటర్జెంట్లు, షాంపూలతో సింథటిక్ పాలను తయారు చేసి అసలు పాలలో కలుపుతున్నారని తెలిపారు. ఇవి కాలేయం, కిడ్నీలను దెబ్బతీసి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయని హెచ్చరించారు. కల్తీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పాలలో షాంపూ, కాస్టిక్ సోడా కల్తీపై ఎఫ్డీఏ కమిషనర్ షాకింగ్ వివరాలు
Source: OneIndia Telugu