కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇండోర్లో నిర్వహించిన 'ఛాత్రోం కీ గూంజ్' విద్యార్థి సంభాషణ కార్యక్రమంలో ఓ విద్యార్థి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడే శైలిని అనుకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది హాస్యాస్పద వ్యంగ్యమేనని కాంగ్రెస్ నేతలు సమర్థిస్తే, వ్యక్తిగత విమర్శలు రాజకీయాలకు తగవని బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. ఎక్స్, ఫేస్బుక్లో ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది.
రాహుల్ గాంధీ ఇండోర్ కార్యక్రమంలో మోదీ ఎగతాళి? వైరల్ వీడియోపై దుమారం
Source: Gulte Telugu