అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బర్త్ టూరిజం నిలిపివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దీన్ని రాజ్యాంగ విరుద్ధమని 22 రాష్ట్రాలు, నాలుగు పౌర హక్కుల సంస్థలు ఫెడరల్ కోర్టులో సవాలు చేశాయి. ఒక న్యాయమూర్తి తాత్కాలికంగా అమలును నిలిపివేశారు. ఈ ఆదేశం ఫిబ్రవరి 19 నుంచి పుట్టే పిల్లలపై ప్రభావం చూపుతుందని, లక్షలాది మంది పౌరసత్వం కోల్పోయే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బర్త్ టూరిజం నిలిపివేత రాజ్యాంగ విరుద్ధమని 22 రాష్ట్రాల వ్యాజ్యం
Source: telugutimes.net