రోజంతా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరంలో శక్తి వినియోగం తగ్గి, కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. వెన్ను, మెడ, భుజాల నొప్పులు కూడా వస్తాయి. గంటకోసారి లేచి నడవడం, మెట్లు ఎక్కడం వంటి చిన్న మార్పులతో ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
ఎక్కువసేపు కూర్చుంటే గుండె జబ్బుల ప్రమాదం
Source: Asianet Telugu