తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విశిష్టతను చాటుతూ బంగారు నాణేన్ని విడుదల చేయాలని టీటీడీ అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దాదాపు మూడు శతాబ్దాల చరిత్ర ఉన్న లడ్డూ ప్రసాదాన్ని 1940లో ప్రస్తుత రూపంలోకి తీసుకొచ్చారు. ప్రతిరోజూ సుమారు నాలుగు లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు.
టీటీడీ లడ్డూ ప్రత్యేకతతో బంగారు నాణెం విడుదలకు ప్రతిపాదనలు
Source: Zee Telugu News