సీఎం చంద్రబాబు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించి, రాజధాని నిర్మాణం రాష్ట్రాభివృద్ధికి మొదటి మెట్టని అన్నారు. 58 రోజుల్లో 29,000 మంది రైతులు 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారని కొనియాడారు. భూగర్భ వ్యవస్థలతో నీటి ఎద్దడి లేని ఆధునిక నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటోందని స్పష్టం చేశారు.
అమరావతి నిర్మాణమే రాష్ట్రాభివృద్ధి విజన్: సీఎం చంద్రబాబు
Source: Vaartha