2027 వన్డే ప్రపంచకప్ను అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ప్రారంభించేందుకు ఐసీసీ యోచిస్తోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చే ఈ టోర్నీలో 14 జట్లు పాల్గొంటాయి. మొదటి వారం వార్మప్ మ్యాచ్లు లేకుండా ప్రధాన మ్యాచ్లు అక్టోబర్ 2 నుంచే ప్రారంభించి, నవంబర్ 21న ఫైనల్ నిర్వహించాలని షెడ్యూల్ సవరిస్తున్నారు.
గాంధీ జయంతి రోజున 2027 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం?
Source: telugutimes.net