తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఆరు నెలలకోసారి ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభిస్తామని ప్రకటించారు. సనత్నగర్లోని టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్యాన్ని బాధ్యతగా భావిస్తున్నామని, ఇప్పటివరకు ఆరోగ్య శాఖకు రూ.2,222 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రతిపక్షాలను విమర్శిస్తూ పేదలకు ఆస్పత్రి కట్టలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి ఆరు నెలలకో ఆస్పత్రి ప్రారంభిస్తాం: రేవంత్ రెడ్డి
Source: Zee Telugu News