జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు స్టేజీ సమీపంలోని మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో సుమారు 25 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ రాజగౌడ్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు.
కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు-లారీ ఢీకొని 25 మందికి గాయాలు
Source: News18 Telugu