బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వరంగల్, కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే వర్షపాతం నమోదైంది.
బంగాళాఖాతంలో వాయుగుండం: ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన
Source: Vaartha