ఏపీ ప్రభుత్వం రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కీలక చర్యలు చేపట్టింది. ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో ఏపీ స్టేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిజర్వేషన్ ఇన్ టీచర్స్ కేడర్ బిల్లు-2026 ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో దాదాపు 77 శాతం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తొలి దశలో 1,523 పోస్టుల భర్తీ చేపడతామని ఆయన తెలిపారు.
ఏపీ యూనివర్సిటీ ఉద్యోగాలకు కీలక చర్య.. లోకేశ్ కొత్త బిల్లు ప్రవేశపెట్టారు
Source: Telugu Bulletin