తెలంగాణలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై విమర్శలు చేసిన సుస్మితపై పార్టీ తీవ్రంగా స్పందించింది. సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని కొందరు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇతర క్రమశిక్షణ తప్పిన నేతలపై చర్యలు తీసుకోకుండా ఆమెపై చర్యలు తీసుకుంటే బీసీ వర్గాల్లో వ్యతిరేకత వస్తుందని పార్టీ ఆందోళన చెందుతోంది.
కొండా సురేఖపై చర్యలు సాధ్యమేనా? పార్టీ వర్గాల్లో చర్చ
Source: Telugu Post