నెల్లూరులోని విఆర్సీ కూడలి వద్ద దిశా చట్టం రద్దును నిరసిస్తూ వైఎస్సార్సీపీ మహిళా నేతలు ధర్నా నిర్వహించారు. జిల్లాపరిషత్ అధ్యక్షులు ఆనం అరుణమ్మ, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం గత ప్రభుత్వం తెచ్చిన దిశా చట్టాన్ని కక్షతో పక్కన పెట్టారని పూజిత ఆరోపించారు. దీనివల్ల మహిళల రక్షణ వ్యవస్థ దెబ్బతింటోందని, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
దిశా రద్దుపై నెల్లూరులో వైఎస్సార్సీపీ ధర్నా
Source: HMTV