తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం జంబూపట్నంలో కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బంగారు వరలక్ష్మి కానుక సీజన్-4 లక్కీడ్రా కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా 103 మంది మహిళలకు బంగారు వరలక్ష్మి రూపులు, పట్టుచీరలు పంపిణీ చేశారు. మహిళా చైతన్యం, హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.
కంబాల ఆధ్వర్యంలో వరలక్ష్మి కానుక లక్కీడ్రా విజయవంతం
Source: telugutimes.net