రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కారు ఢీకొట్టి తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై తండ్రి వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేశారు. కుమార్తె ఐసీయూలో వెంటిలేటర్పై ఉండటం చూసి మనసు ముక్కలవుతోందని కంటతడి పెట్టారు. న్యాయం చేయాలని స్థానికులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రియాంక తండ్రి ఆవేదన: నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి
Source: Vaartha