దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో స్వల్పంగా పెరిగింది. ఆహార ధరలను ప్రతిబింబించే CFPI జూన్లో 5.32 శాతం నుంచి జూలైలో 5.52 శాతానికి చేరింది. కూరగాయలు, పప్పులు, ధాన్యాల ధరలు పెరగడమే దీనికి కారణం. అయితే ఇది RBI నిర్దేశించిన 2-6 శాతం సహన పరిధిలోనే ఉంది. రుతుపవనాలు, సరఫరా, అంతర్జాతీయ కమోడిటీ ధరలు రానున్న నెలల్లో ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఆహార ధరలతో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల
Source: Vaartha