సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి నర్మాల ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పూడిక కారణంగా ప్రాజెక్టు సామర్థ్యం 2.2 టీఎంసీల నుంచి 1.2 టీఎంసీలకు పడిపోయిందని, రూ.500 కోట్లు కేటాయించి సమగ్ర అభివృద్ధి చేయాలని కోరారు. గోదావరి జలాలను అనుసంధానం చేయడమే శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు.
నర్మాల ప్రాజెక్టు పునరుద్ధరణకు రూ.500 కోట్లు కేటాయించాలని సీపీఐ డిమాండ్
Source: HMTV