ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలకు సోషల్ మీడియాలో మాట్లాడే భాషపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం వాడొద్దని, మహిళలను గౌరవించాలని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించే వారిపై జాగ్రత్తగా ఉండాలని, కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టాలని ఆదేశించారు.
పవన్ కళ్యాణ్ కీలక సూచనలు: సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని జనసేన క్యాడర్కు ఆదేశం
Source: Zee Telugu News