హైదరాబాద్లోని బాలాపూర్ గణేశ్ ఉత్సవాలకు ఈసారి పూరీ జగన్నాథ్ ఆలయం నమూనాలో మండపం ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అయోధ్య రామమందిరం, యాదాద్రి వంటి థీమ్లతో ప్రత్యేకత చాటిన సుధాకర్ రెడ్డి డెకరేటర్స్ ఈసారి జగన్నాథ్ ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
బాలాపూర్ గణేశ్ మండపం థీమ్: పూరీ జగన్నాథ్ ఆలయం
Source: Zee Telugu News