జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు-లారీ ఢీకొన్న ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారం వ్యక్తం చేసి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం.. 25 మందికి గాయాలు
Source: OneIndia Telugu