రాయదుర్గం పాన్మక్తలోని రెండు ప్లాట్ల వేలానికి సంబంధించి టిజిఐఐసి జారీ చేసిన నోటిఫికేషన్పై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్ డాక్టర్ ఎస్.రవీంద్రనాథ్ చారిత్రక ప్రాధాన్యత, పురాతన రాళ్ల పరిరక్షణ కోణంలో వేలంను సవాలు చేశారు. ప్రభుత్వం, టిజిఐఐసి, హెచ్ఎండిఏలను కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు.
రాయదుర్గం ప్లాట్ల వేలంపై స్టేకు హైకోర్టు నిరాకరణ
Source: Mana Telangana