తమిళనాడు ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు మూడో బిడ్డకు కూడా 365 రోజుల పూర్తి వేతన సెలవులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మొదటి, రెండో కాన్పులకు మాత్రమే ఈ సెలవులు వర్తించేవి. మానవ వనరుల శాఖ మంత్రి డి. శరత్కుమార్ ఈ ప్రకటన చేశారు. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
తమిళనాడులో మహిళా ఉద్యోగులకు మూడో కాన్పుకూ 365 రోజుల సెలవు
Source: Vaartha