దేశవ్యాప్తంగా 2023-26 మధ్య 70,652 పండ్లు, కూరగాయల నమూనాలను పరీక్షించగా 2,223 లో అధిక పురుగు మందుల అవశేషాలు కనిపించాయి. వీటిలో సగం దక్షిణ భారత రాష్ట్రాల నుంచే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వంకాయ, బెండ, టమాటా, క్యాప్సికం, ద్రాక్షలో మోనోక్రోటోఫాన్ వంటి రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. వీటి దీర్ఘకాల ప్రభావం క్యాన్సర్, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలకు దారితీయవచ్చు.
ఆకు కూరల్లో పురుగు మందుల అవశేషాలు
Source: Vaartha