అమెరికాలో వృద్ధులను టార్గెట్ చేసిన మోసం కేసులో గుజరాత్కు చెందిన 21 ఏళ్ల భారతీయుడు జై సునీల్భారతి గోస్వామి అరెస్టయ్యాడు. న్యూజెర్సీలో నివసిస్తున్న అతను మనీ మ్యూల్గా పనిచేసి బాధితుల నుంచి నగదు, బంగారం సేకరించినట్లు ఆరోపణలున్నాయి. 59 నుంచి 87 ఏళ్ల మధ్య వయసున్న బాధితులు మొత్తం $7.56 మిలియన్లు కోల్పోయారు. వైర్ మోసం, మనీ లాండరింగ్ వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతనికి గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడవచ్చు.
అమెరికాలో $7.5 మిలియన్ మోసం కేసులో భారతీయుడి అరెస్ట్
Source: Gulte Telugu