వెలిగొండ ప్రాజెక్టును 2026 ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేసి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. సొరంగాల్లో నిలిచిపోయిన 286 మీటర్ల సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులను ఆగస్టు 18 కల్లా ముగించాలని ఆదేశించారు. చిక్కుకున్న 1,900 మెట్రిక్ టన్నుల టీబీఎం యంత్రాన్ని బయటకు తీసే పనులు 70% పూర్తయ్యాయి. నిర్వాసిత కుటుంబాలకు రూ.600 కోట్ల పరిహారం పంపిణీ చేయనున్నారు.
వెలిగొండ ప్రాజెక్టు ఆగస్టు నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశం
Source: Vaartha