తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓటర్లకు నకిలీ మెసేజ్లు వస్తున్నాయని ఎన్నికల అధికారులు హెచ్చరించారు. రూ.5 చెల్లించాలంటూ లింకులు పంపుతున్న సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి మెసేజ్లకు ఎన్నికల సంఘంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అనుమానాస్పద మెసేజ్లు వస్తే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
ఎస్ఐఆర్ పేరుతో నకిలీ మెసేజ్లపై హెచ్చరిక
Source: Samayam Telugu