మెదక్ కలెక్టరేట్లో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రోహిత్ రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్ మహిళలకు డిజిటల్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ. 23 వేల కోట్ల రుణాలు అందించిందని, త్వరలో మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. స్మార్ట్ కార్డుల్లో కుటుంబ వివరాలు ఉంటాయని, రేషన్ కార్డుల అక్రమాలను అరికట్టేందుకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.
మెదక్లో మహిళలకు డిజిటల్ స్మార్ట్ కార్డుల పంపిణీ
Source: Vaartha